AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా క్రైసిస్‌: అమ్మ నాన్న స్పూర్తితో.. రాజశేఖర్ కుమార్తెల ఉదారభావం..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్ పలు రంగాలపై పడింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో రోజువారీ జీతం మీద ఆధారపడిన చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి.

కరోనా క్రైసిస్‌: అమ్మ నాన్న స్పూర్తితో.. రాజశేఖర్ కుమార్తెల ఉదారభావం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 8:36 PM

Share

లాక్‌డౌన్ ఎఫెక్ట్ పలు రంగాలపై పడింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో రోజువారీ జీతం మీద ఆధారపడిన చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. వారిలో సినీ కార్మికులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పెట్టిన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి ఇప్పటికే పలువురు తమ వంతు విరాళాలను ఇచ్చారు. ఈ క్రమంలో జీవితా, రాజశేఖర్ దంపతుల ఇద్దరు కుమార్తెలు తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.

కరోనా క్రైసిస్‌ ఛారిటీకి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు శివానీ, శివాత్మిక ప్రకటించారు. ఈ మేరకు జీవితా రాజశేఖర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. “ఇప్పటికే రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కరోనా క్రైసిస్‌ ఉన్నంతవరకు సాగుతుంది. అలాగే కరోనా క్రైసిస్ ఛారిటీలో మా కుటుంబం కూడా భాగం అయింది. మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికలు చెరో లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి, కష్టాల్లో ఉన్న పేద కార్మికులకు సహాయం అందించడంలో మా కుటుంబం సహాయం ఎప్పుడూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని ఆమె అన్నారు.

Read This Story Also: హైదరాబాద్‌లో సెంచరీ క్రాస్.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎంతంటే..!