Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie: మరోసారి ‘ఆదిపురుష్’ సినిమాపై స్పందించిన డైరెక్టర్.. ఏమన్నాడంటే..

Prabhas Adipursh పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు

Adipurush Movie: మరోసారి 'ఆదిపురుష్' సినిమాపై స్పందించిన డైరెక్టర్.. ఏమన్నాడంటే..
Om Raut
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 23, 2021 | 10:15 PM

Prabhas Adipurush పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. తాజాగా ఈ మూవీ గురించి మరోసారి స్పందించాడు డైరెక్టర్ ఓంరౌత్.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పాజిటివితోనే జరుగుతుంది. అందరూ.. ఉత్సహంగా పాల్గోంటున్నారు అంటూ చెప్పుకోచ్చాడు డైరెక్టర్. 3డీ టెక్నాలజీలో రూపొందనున్న ఈ సినిమా సెట్స్ లో ఉన్న పాజిటివిటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్స్ లో గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ లా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. గతంలో ఓంరౌత్ ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా కష్టమైన పని అని.. ప్రపంచంలోని హాఫ్ బిలియన్ ప్రేక్షకలకు మెప్పించేలా ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలిపారు. ఇందులోని ఒక్క పాత్రలలో భిన్నమైన కోణాన్ని చూపించబోతున్నట్లుగా చెప్పుకోచ్చాడు. అంతేకాకుండా ఇటీవల ఆదిపురుష్ సినిమాపై వచ్చిన రూమర్స్ పై స్పందించాడు డైరెక్టర్. సినిమాపై ఏర్పడిన వివాదం అప్పటితోనే ముగిసిందని చెప్పుకోచ్చాడు. అటు ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్‏కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Also Read:

రహాస్యంగా పెళ్ళిచేసుకున్న ప్రభాస్ హీరోయిన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్.. పెళ్లికొడుకు ఎవరంటే..

టాలీవుడ్‏పై కన్నెసిన తమిళ స్టార్ హీరో.. సరైన పార్టనర్ కోసం వెతుకులాట.. అన్ని కుదిరితే త్వరలోనే ఎంట్రీ..