బాహుబలి వర్సెస్ ఆర్ఆర్ఆర్ అంటోన్న రాజమౌళి!
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రదారులుగా రాజమౌళి తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు కారణం జక్కన్నే. ఆర్ఆర్ఆర్ ఒక పాన్ ఇండియా చిత్రమని, దేశం మొత్తాన్ని ఆకట్టుకోగలదని రాజమౌళి అన్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ – 2019 పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీ టాలీవుడ్నే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. బాహుబలికి ఈ మూవీ ఏమాత్రం తీసిపోదని రాజమౌళి అనడంతో అంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను బాహుబలి […]
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రదారులుగా రాజమౌళి తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు కారణం జక్కన్నే. ఆర్ఆర్ఆర్ ఒక పాన్ ఇండియా చిత్రమని, దేశం మొత్తాన్ని ఆకట్టుకోగలదని రాజమౌళి అన్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ – 2019 పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీ టాలీవుడ్నే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు.
బాహుబలికి ఈ మూవీ ఏమాత్రం తీసిపోదని రాజమౌళి అనడంతో అంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను బాహుబలి రేంజ్లో ఊహించుకుంటున్నారు. అంతకుమించి ఉంటుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీపై ఇంతవరకూ మాట్లాడని జక్కన్న మొదటిసారే ఇలాంటి కామెంట్ చేయడంతో ఈ మాటలు వైరల్గా మారాయి. రూ. 300 కోట్లతో డివీవీ దానయ్య ఈ మల్టీ స్టారర్ మూవీని నిర్మిస్తుండగా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ మూవీకి సంబంధించి షెకండ్ షెడ్యూట్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.