బాహుబలి నిర్మాతల కొత్త ప్రాజెక్ట్.. మలయాళ రీమేక్తో..!
బాహుబలిని నిర్మించి టాలీవుడ్ స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు.. దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. కంటెంట్ ఉన్న కథలపైనే ఆసక్తి చూపుతున్న ఈ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మలయాళంలో విజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు ఈ నిర్మాతలు. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్తో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ […]

బాహుబలిని నిర్మించి టాలీవుడ్ స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు.. దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. కంటెంట్ ఉన్న కథలపైనే ఆసక్తి చూపుతున్న ఈ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మలయాళంలో విజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు ఈ నిర్మాతలు. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్తో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ రీమేక్కు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తుండగా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్నపాటి టీజర్ను కూడా విడుదల చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే కొత్త లుక్లో వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే తన సహజ నటనతో సత్యదేవ్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు జబర్దస్త్ రాంప్రసాద్, సుహాస్, టీఎన్ఆర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. బిజ్పాల్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే చిన్న బడ్జెట్లోనే వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం.