AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్- చెర్రీ సినిమా అప్పుడేనా..!

టాలీవుడ్‌లోకి పవర్‌స్టార్  పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఖరారు అయిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆయన రీ ఎంట్రీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీలో విజయం సాధించిన పింక్ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతుండగా.. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించబోతున్న ఈ మూవీ కోసం పవన్ 20 రోజుల డేట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. […]

పవన్- చెర్రీ సినిమా అప్పుడేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 12:34 PM

Share

టాలీవుడ్‌లోకి పవర్‌స్టార్  పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఖరారు అయిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆయన రీ ఎంట్రీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీలో విజయం సాధించిన పింక్ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతుండగా.. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించబోతున్న ఈ మూవీ కోసం పవన్ 20 రోజుల డేట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన బ్యానర్‌లో మూవీలను నిర్మించేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కూడా ఓ సందర్భంలో మాట్లాడారు. తాను సినిమాలు చేస్తానో, చేయనో తెలీదు గానీ.. కచ్చితంగా నిర్మిస్తాను అంటూ పవన్ చెప్పుకొచ్చారు. అలాగే చరణ్‌తో సినిమా తీసే ఆలోచన కూడా మరో సందర్భంలో పవర్‌స్టార్ చెప్పుకొచ్చారు. కాగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఏడాది ఖరారు కానుందని తెలుస్తోంది. అన్ని కుదిరితే 2020 ద్వితీయార్ధంలో చెర్రీతో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని పవన్ భావిస్తున్నారట. అంతేకాదు మెగా ఫ్యామిలీలోని మిగిలిన హీరోలతో కూడా పవన్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు చెర్రీ. అయినప్పటికీ పలు కథలను వింటున్నాడని.. ఇటీవల తమిళ్‌లో విడుదలైన హీరో మూవీపై కూడా చెర్రీ కన్ను పడిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తానికి చెర్రీ తదుపరి సినిమా ఏంటి..? ఆ సినిమాను పవన్ కల్యాణ్ నిర్మించనున్నాడా..? మెగా ఫ్యాన్స్ ఎదురుచూసే ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుంది..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.