‘ది వైట్ టైగర్’ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్ విడుదల.. ఇందులో కొన్ని సన్నివేశాలను చూస్తే..
ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది వైట్ టైగర్ సినిమాకు సంబంధించి
ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది వైట్ టైగర్ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ మరో ట్రైలర్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2008లో మ్యాన్ బ్రోకర్ ప్రైజ్ అందుకున్న అరవింద్ అడిగా నవల ‘ది వైట్ టైగర్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా వచ్చే ఏడాది జనవరి 22న నెట్ఫ్లిక్స్తో పాటు మరి కొన్ని థియేటర్స్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఇందులో ఆదర్శ్ గౌరవ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఇండియాకు చెందిన ఓ నిరుపేద డ్రైవర్గా కనిపించనున్నాడు. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. వ్యాపారం కోసం యూఎస్ నుంచి భారత్కు వచ్చిన జంటకు ఆదర్శ్ గౌరవ్ పరిచయం కాగా, అతను తన కలను వారికి వివరిస్తాడు. కాని స్టేటస్ వల్ల అతనికి నిరాశ ఎదురవుతుంది. అనేక ట్విస్ట్లతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.