AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజుల్లో రూమ్ రెంటుకు కూడా నాదగ్గర డబ్బుల్లేవు.. కెరియర్ స్టార్టింగ్‌‌‌లో ఈ యంగ్ హీరో ఇన్ని ఇబ్బందులు పడ్డాడా.!

టాలీవుడ్ లో టాలెంటడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవిశేష్. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకయుంటూ.. హిట్స్ అందుకుంటున్నాడు.

ఆ రోజుల్లో రూమ్ రెంటుకు కూడా నాదగ్గర డబ్బుల్లేవు.. కెరియర్ స్టార్టింగ్‌‌‌లో ఈ యంగ్ హీరో ఇన్ని ఇబ్బందులు పడ్డాడా.!
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2020 | 6:35 PM

Share

టాలీవుడ్ లో టాలెంటడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవిశేష్. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకయుంటూ.. హిట్స్ అందుకుంటున్నాడు. క్షణం, గూఢచారి సినిమాలతో వరుసహిట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శేష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులగురించి అడవిశేష్ మాట్లాడారు. అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చాను . కానీ నేను సినిమాల్లోకి రావడంతోనే నా దగ్గరున్న డబ్బులతో సినిమాను నిర్మించి తప్పుచేసాను. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో నా డబ్బులన్నీ పోయాయి. దాంతో ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడ్డాను ఆతర్వాత కొన్నిసినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. నా స్నేహితులు కూడా నటించమని ప్రోత్సహించారు. దాంతో ఆ సినిమాలో నటించా. ‘పంజా’ సినిమా నా కెరియర్ కు చాలా ప్లెస్ అయ్యింది. ఆ తర్వాత ‘కిస్’ అనే సినిమా చేశాను. ఆ సినిమాను నేను పెట్టుబడులు పెట్టాను. ఆ మూవీకూడా ఫ్లాప్ అయ్యింది. ఒకానొక సమయంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. అప్పుడు వచ్చిన సినిమాను కాదనకుండా చేసుకుంటూ వచ్చా.. ఆ సమయంలో కొన్ని ఇష్టం లేకుండా కూడా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు శేష్. ఇక ప్రస్తుతం నటిస్తున్న ‘మేజర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేసాడు అడవి శేష్.