Sameera Reddy: ఆ సమయంలో అలాంటి కామెంట్స్ చూస్తే బాధేసింది.. ఆసక్తికర విషయాలను చెప్పిన సమీరా రెడ్డి..
చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్తో అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంది.

చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్తో అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంది. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి చేసుకోని సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా మరోసారి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి కీలక విషయాలను బయటపెట్టింది. తాను గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కోన్న సంఘటనల గురించి గుర్తు చేసుకుంది. మొదటి సారి తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనలో వచ్చిన మార్పులు చూసి తనకు తానే నచ్చలేదని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి జనాలు చేసే కామెంట్లు కూడా దారుణంగా ఉండేవని.. వాటిని చూసి చాలా బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తన బాడీ గురించి జనాలు చేసే కామెంట్లు చూసినప్పుడు బాధనిపిచ్చిన.. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. ఇక రెండవ సారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని.. మరోసారి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండేదని తెలిపింది. ఇక ఇద్దరు పిల్లల తల్లిని కాబట్టి కచ్చితంగా మునుపటి షేప్ రావడానికి టైం పడుతుందని .. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాని చెప్పింది. ఇలాంటి కామెంట్ల వల్ల తనకు మాత్రమే కాకుండా మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బందులు పడతారని చెప్పుకోచ్చింది.