Pathaan: బాక్సాఫీస్ను షేక్ చేసిన బాద్ షా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపేందుకు సిద్ధం.. ‘పఠాన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం పఠాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందీ మూవీ. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం పఠాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందీ మూవీ. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కి గురి చేసింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బాహుబలి 2 చిత్రాన్ని వెనక్కి నెట్టి హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.
తాజాగా పఠాన్ హిందీలో రూ.511.70 కోట్లు వసూలు చేసి, ‘బాహుబలి2’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును (రూ.510.99 కోట్లు)ను దాటేసింది. ఇదిలా ఉంటే వెండి తెరపై సంచనాలు సృష్టించిన ఈ సినిమా డిజిటల్ స్క్రీన్పై ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. మరోసారి చిత్రాన్ని ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం పఠాన్ చిత్రాన్ని ఏప్రిల్ చివరిలో ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. థియేటర్లలో సినిమా ఇంకా రన్ అవుతుండడంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో పఠాన్ మూవీ యూనిట్ పునరాలోచనలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..