AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?

లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఏ20గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యనే ప్రారంభం కాగా.. త్వరలో ఈ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు బన్నీ.

AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2020 | 3:36 PM

Share

లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఏ20గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యనే ప్రారంభం కాగా.. త్వరలో ఈ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు బన్నీ. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. ఈ మూవీలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆయనతో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలనుకుంటోన్న సుకుమార్.. కాస్టింగ్‌ను కూడా అలానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా సుకుమార్‌కు, జగపతిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాల్లో జగ్గు భాయ్‌కు గుర్తుండిపోయే పాత్రలను ఇచ్చారు సుకుమార్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి తన సినిమాలో విలన్‌గా ఆయన్నే ఎన్నుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. బన్నీకి జగపతి బాబు విలన్‌గా నటించడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక ఇందులో బన్నీ చిత్తూరుకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇందుకోసం రాయలసీమ యాసను కూడా నేర్చుకుంటున్నారట. అలాగే రష్మిక పల్లెటూరి యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించి ఇటీవలే లుక్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుక్కు- బన్నీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ప్రణయ్ హత్య కేసు విచారణ ఈ నెల 23కి వాయిదా..