AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో వెల్లువెత్తిన హింస, గవర్నర్ కు ప్రధాని మోదీ ఫోన్, తాజా పరిస్థితులపై ఆరా

ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో వెల్లువెత్తిన హింసపై ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్టంలో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు...

బెంగాల్ లో వెల్లువెత్తిన హింస, గవర్నర్ కు ప్రధాని మోదీ ఫోన్, తాజా పరిస్థితులపై ఆరా
Pm Modi.
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 04, 2021 | 4:14 PM

Share

ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో వెల్లువెత్తిన హింసపై ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్టంలో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల  గురించి అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్ కూడా…. లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తాను ఆయనకువివరించానని ట్వీట్ చేశారు. సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి మరో ట్వీట్ చేస్తూ.. రాష్ట్రంలో అల్లర్లు, హింస, హత్యలు, దాడులపై మీరు వెలిబుచ్చిన ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నానని, సాధారణ పరిస్థితులు  సాధ్యమైనంత త్వరలో ఏర్పడగలవని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కాగా బెంగాల్ లో జరిగిన హింస, అల్లర్లలో కనీసం 12 మంది మరణించారు. తమ పార్టీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, వారి ఇళ్ళ లోకి చొరబడి దౌర్జన్యాలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరాం గఢ్ వంటి పలు చోట్ల తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారని వారు తెలిపారు. 6 జిల్లాల్లో 8 మంది తమ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు కూడా హతులయ్యారని అన్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమిని జీర్ణించుకోలేక ఇలా హింసకు దిగారన్నారు.

మరోవైపు సీఎం మమతా బెనర్జీ ..బెంగాల్ శాంతి కాముక రాష్ట్రమని, ఈ ఎన్నికల్లో అక్కడక్కడఘ్జర్షణలు జరిగాయని అన్నారు. తమ పార్టీ వర్గీయులను బీజేపీ ఎంతో వేధించిందని, కానీ శాంతియుతంగా ఉండాలని తమ పార్టీ వారిని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు, ఏదైనా వివాదం ఉంటె పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. [పోలీసులు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు. కాగా రాష్ట్రంలో 4 వేల ఇళ్లపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడులు  చేశారని, మహిళలపై అత్యాచారాలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. అటు-ఈ హింసపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ ఈ పార్టీ నాయకుడొకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రెండు రోజుల పర్యటనకు గాను బెంగాల్ ను సందర్శించనున్నారు. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోమ్ శాఖ నివేదిక కోరింది. అటు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ఈ హింసను ఖండిస్తూ ట్వీట్ చేశారు. సీపీఎం  కార్యకర్తలపై కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా తూర్పు బర్ధన్ జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలైన ముగ్గురిని బీజేపీ కార్యకర్తలు కొట్టి చంపారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!