AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి

గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?
uppula Raju
|

Updated on: Dec 26, 2020 | 7:28 PM

Share

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతురాలు ఈస్ట్‌ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందిని పంకజ్‌రాయ్‌గా గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబైలోని కాందీవ్లీలో నందిని ఆమె భర్త, మామతో కలిసి నివాసముంటోంది. డిసెంబర్‌లో ఆమె భర్త పని మీద వేరే ఊరు వెళ్లగా, ఇంట్లో నందిని, ఆమె మామ మాత్రమే ఉన్నారు. అయితే కొన్నిరోజులకే నందిని బీచ్‌లో శవమై తేలింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చాలా సార్లు ఫోన్ చేసినా నందిని ఫోన్ పనిచేయకపోవడంతో వారికి అనుమానం తలెత్తింది. వెంటనే నందిని నాన్న ఆమె ఉంటున్న కాందీవ్లీకి వచ్చి వెతికాడు. అయినా ఆమె కనిపించలేదు. చుట్టు పక్కల విచారించినా ఎటువంటి వివరాలు తెలియలేదు. దీంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ వెళ్లి మిస్సింగ్ కంప్లెంట్ ఇచ్చాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నందిని మామపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నందిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. రిపోర్ట్స్ వస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా నందిని తల్లిదండ్రులు కూతురు మృతిని తట్టుకోలేక గుండలవిసేలా రోధించడం అందరిని కంటతడిపెట్టిస్తోంది.