AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. విడిపోయి మళ్లీ కలిశారు.. చివరకు భర్తపై పెట్రోల్ పోసి..

Wife killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంది. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తోంది.

AP Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. విడిపోయి మళ్లీ కలిశారు.. చివరకు భర్తపై పెట్రోల్ పోసి..
Fire
Shaik Madar Saheb
|

Updated on: Apr 12, 2022 | 11:06 AM

Share

Wife killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు కలిసి జీవించారు. ఆ తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంది. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తోంది. అయినా భర్త తీరు మారలేదు. వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. దీంతో తట్టుకోలేని భార్య.. లీటర్‌ పెట్రోల్‌ తెచ్చి.. మందు తాగి మత్తులో పడుకున్న భర్తపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారైంది. సోమవారం జరిగిన ఈ ఘటన ప్రకాశం (Prakasam district) జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన క్రిష్టిపాటి మోహన కృష్ణారెడ్డి (31) సంతనూతలపాడుకి చెందిన రుక్మిణిని 2011లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే.. మోహన కృష్ణారెడ్డి అప్పటి నుంచి సంతనూతలపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కారు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న కృష్ణారెడ్డి.. మద్యానికి బానిసై భార్య, కుమారుడిని నిత్యం వేధించేవాడు. అయితే.. వేధింపులు తట్టుకోలేక రుక్మిణి అంతకుముందు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఆ తర్వాత భర్త ఆగడాలు తట్టుకోలేక 2016లో కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది.

ఈ క్రమంలో కృష్ణారెడ్డి సోదరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అయినప్పటికీ.. కృష్ణా రెడ్డిలో మార్పురాలేదు. ఆదివారం రాత్రి కూడా భార్య, కుమారుడిని హింసించాడు. వేధింపులు తాళలేక రుక్మిణి.. మద్యం తాగి వచ్చి మత్తులో పడుకున్న కృష్ణారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి పొగలు.. మంటలు రావడాన్ని చూసిన స్థానికులు పోలీసులుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Hair Colouring Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా..? ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి

Mobile Radiation: మొబైల్‌ రేడియేషన్‌ అంటే ఏమిటి..? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ