కొడుకు మరణవార్త విని..ఆగిన తండ్రి గుండె..

కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. కుటంబంలో ఎవరైనా చనిపోయినా.. కరోనాతో ప్రాణాలు పోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే..ఇంట్లోని వారంతా భయందోళనకు గురవుతున్నారు..

కొడుకు మరణవార్త విని..ఆగిన తండ్రి గుండె..
Follow us

|

Updated on: Jul 17, 2020 | 11:55 AM

కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. కుటంబంలో ఎవరైనా చనిపోయినా.. కరోనాతో ప్రాణాలు పోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే..ఇంట్లోని వారంతా భయందోళనకు గురవుతున్నారు. తన కొడుక్కి కరోనా సోకిందని తెలియగానో ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన నాగర్‌ కర్నూలు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూలు జిల్లాలోని లింగాల మండలం సూరాపురానికి చెందిన జర్నలిస్టు లక్ష్మీనారాయణ కరోనా కారణంగా మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయిన విషయాన్ని బుధవారం రాత్రి వరకూ అతడి తండ్రికి తెలియకుండా కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. ఇంటి చుట్టుపక్కల వారు, తమ బంధువుల ద్వారా చివరకు విషయం తెలియటంతో ఆ వృద్ధ తండ్రి తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా తెలిసింది. కుమారుడి మరణవార్తను తట్టుకోలేక కుంగిపోయిన తండ్రి గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపుగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో తండ్రీ, కొడుకులిద్దరూ మరణించటంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Latest Articles