AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలన తీర్పు.. భార్యను 300 ముక్కలు చేసిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష..

ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన కేసులో ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్​ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది.  యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. 

సంచలన తీర్పు.. భార్యను 300 ముక్కలు చేసిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 4:02 PM

Share

ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్​ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది.  యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.

78 ఏళ్ల సోమనాథ్​ పరిదా ఆర్మీలో లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాలో వైద్యుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. విబేధాలు కారణంగా తన భార్య ఉషా శ్రీని 2013లో అతికిరాతకంగా చంపి.. ఆమె శరీరాన్ని 300 ముక్కలు చేసి..ఇంట్లో ఉన్న 22 చిన్న, చిన్న టిఫిన్ బాక్సుల్లో దాచిపెట్టాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సోమనాథ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్య, ఆధారాల ధ్వంసం సహా పలు కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా నిర్దారిస్తూ..యావజ్జీవ శిక్ష విధించింది.