AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల కళ్లు గప్పి.. కిటికీ నుంచి ఖైదీ పరార్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. తణుకు ప్రభుత్వాస్పత్రిలో ఓ ఖైదీ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇదే అదనుగా భావించిన.. పారిపోయేందుకు స్కెచ్ వేసుకుని.. వెంటనే దాన్ని అమలు చేశాడు.తాడేపల్లి గూడెంలో ఉంటున్న గుడివాడకు చెందిన తిరుమాని సిద్ధూ బైక్ దొంగతనాలకు పాల్పడగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు శిక్ష వేయడంతో.. జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే […]

పోలీసుల కళ్లు గప్పి.. కిటికీ నుంచి ఖైదీ పరార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2019 | 1:07 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. తణుకు ప్రభుత్వాస్పత్రిలో ఓ ఖైదీ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇదే అదనుగా భావించిన.. పారిపోయేందుకు స్కెచ్ వేసుకుని.. వెంటనే దాన్ని అమలు చేశాడు.తాడేపల్లి గూడెంలో ఉంటున్న గుడివాడకు చెందిన తిరుమాని సిద్ధూ బైక్ దొంగతనాలకు పాల్పడగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు శిక్ష వేయడంతో.. జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే బాత్రుంకని వెళ్లిన సిద్ధూ.. పోలీసుల కళ్లు గప్పి కిటికీలోంచి పారిపోయాడు. వెంటనే పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా సిద్ధూ ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిద్ధూ కోసం విస్త్రతంగా గాలిస్తున్నారు.