Cyber Crime: యాప్ డౌన్లోడ్ చేయించి డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేశారు.. ఎంతకి.. ఎలా ముంచేశారంటే..!

డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు అరకోటికి ముంచేశారు..! హైదరాబాద్ మాదన్నపేటకి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేసి డైమండ్స్ ట్రేడింగ్‌లో

Cyber Crime: యాప్ డౌన్లోడ్ చేయించి డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేశారు.. ఎంతకి.. ఎలా ముంచేశారంటే..!
Diamonds
Follow us

|

Updated on: Sep 23, 2021 | 9:09 AM

Diamonds Trading: డైమండ్స్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు అరకోటికి ముంచేశారు..! హైదరాబాద్ మాదన్నపేటకి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేసి డైమండ్స్ ట్రేడింగ్‌లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయి అంటూ ముగ్గులోకి లాగారు..! దీనికోసం యాప్‌ని డౌన్లోడ్ చేయించి పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు వస్తున్నట్టు యాప్‌లో చూపిస్తూ వచ్చారు. ఇలా మొత్తం ₹43 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత యాప్ లింక్ ను డిలీట్ చేయడంతో మోసపోయానని గ్రహించిన అబ్దుల్.. సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే.. అత్యాశ లక్షలు, కోట్లకు ముంచేస్తోంది. యాప్ ద్వారా డైమండ్స్ ట్రేడింగ్‌ కోట్ల సంపాదించొచ్చని ఎవడో చెప్పడం, దాన్ని నమ్మడం ఫైనల్‌గా అరకోటి పోగొట్టుకోవడం.. ఇదీ హైదరాబాద్‌లో జరిగిన ఉదంతం. మాదన్నపేట కి చెందిన అబ్దుల్ ఆదిల్ కి కాల్ చేశారు కొందరు. డైమండ్స్ ట్రేడింగ్ లో నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయని చెప్పుకొచ్చారు. డబ్బంటే ఆశతో ఎలా ఏంటీ అని వివరాలు అడిగాడు అబ్దుల్‌. Idex.appfact.club అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని.. పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చే లాభాలు ఇలా ఉంటాయంటూ ప్రీప్లాన్డ్‌గా రెడీ చేసుకున్న సాఫ్ట్‌వేర్‌తో బురిడీ కొట్టించారు. అది కాస్తా నమ్మిన అబ్దుల్‌.. ₹43 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అతను అలా ట్రాన్స్‌ఫర్ చేశాడో లేదో…. యాప్‌ లింక్‌ డిలీట్ అయిపోయింది. 43 లక్షలు పోయిన తర్వాత గానీ.. మోసపోయాను అని తెలుసుకోలేకపోయాడు అబ్దుల్.

వాట్సాప్, క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా మోసాలు..

సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. బిట్ కాయిన్ – ఎం8 పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చాంద్రాయణగుట్టకి చెందిన షేక్ నసీబుద్దీన్ ఫోన్ నెంబర్ ను అందులో యాడ్ చేశారా మాయగాళ్లు.

బిట్ కాయిన్ వ్యాపారంపై ట్రైనింగ్ ఇస్తున్నట్టు నసీబుద్దీన్‌ను మభ్యపెట్టారు. ఇలా అతడి నుండి పలు విడతలుగా మొత్తం 14 లక్షలకు పైగా కాజేశారు కేటుగాళ్లు. డబ్బులు కాజేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేశారు. దీంతో లబోదిబోమంటూ సిటీ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు నసీబుద్దీన్ ఫిర్యాదు చేశాడు.

ఇదిలాఉంటే, హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన బిజినెస్ ఉమెన్ రేఖకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రెండు క్రెడిట్ కార్డుల నుండి ఆమెకు తెలియకుండానే ₹5.70 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read also:  Yadadri: యాదాద్రి జిల్లాలో హైవేపై టిప్పర్ లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. భీకర దృశ్యాలు.!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు