నంది విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. అర్థరాత్రి పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

నంది విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు
Follow us

|

Updated on: Sep 28, 2020 | 3:11 PM

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. అర్థరాత్రి పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గంగాధర నెల్లూరు మండలం అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట ఉన్న పురాతన నంది విగ్రహాన్ని శనివారం రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెనుకభాగం నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు నంది విగ్రహాన్ని పెకలించి గుడి వెనుకకు తీసుకెళ్లి పగులగొట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు కొందరిని గుర్తించినట్లు సమాచారం. మత విద్వేషాలు రెచ్చ గొట్టడమే లక్ష్యంగా కొందరు పథకం ప్రకారం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ స్వయంగా దర్యాప్తు ప్రారంభించారు. గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి 3 గంటల పాటు 89 మంది అనుమానితులను విచారించారు. నంది విగ్రహం ధ్వంసం కేసును మూడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ప్రార్థన మందిరాలపై పథకం ప్రకారం కొందరు దుండగులు దాడులకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఆ కోణంలో కూడా విచారణ చేపట్టామని ఎస్పీవో ఈశ్వర్ రెడ్డి చెప్పారు.