AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరం నడిబొడ్డున దారుణం.. మాయమాటలు చెప్పి.. పన్నెండేళ్ల బాలికపై…

నిర్భయ చట్టం ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మద్యం మత్తా.. లేక ఇంకేమైనా కానీ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాదని ఎదిరిస్తే.. హతమారుస్తున్నారు. చిన్న పిల్లలని లేదు.. మైనర్ బాలిక అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పీఎస్ పరిధిలో.. ఓ పన్నెండేళ్ల మైనర్ బాలికపై జహంగీర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక […]

నగరం నడిబొడ్డున దారుణం.. మాయమాటలు చెప్పి.. పన్నెండేళ్ల బాలికపై...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 29, 2020 | 12:27 PM

Share

నిర్భయ చట్టం ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మద్యం మత్తా.. లేక ఇంకేమైనా కానీ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాదని ఎదిరిస్తే.. హతమారుస్తున్నారు. చిన్న పిల్లలని లేదు.. మైనర్ బాలిక అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పీఎస్ పరిధిలో.. ఓ పన్నెండేళ్ల మైనర్ బాలికపై జహంగీర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. మాయమాటలు చెబుతూ.. పదిరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే రోజు రోజుకూ నీరసంగా కనిపిస్తున్న కూతుర్ని చూసిన తల్లి.. ఆరా తీసింది. దీంతో జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు జహంగీర్ పరారీలో ఉన్నాడు.