Robbery: హాలీవుడ్ సినిమాను తలపించిన భారీ దోపిడి.. డ్రైనేజ్ పగులగొట్టి.. ఏసీ పైప్‌ల నుంచి దూరి..

Massive robbery in Vellore district: తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కోట్లలో బంగారం, వజ్రాలు దోపిడీ చేశారు. ఈ భారీ దోపిడీ ఘటన వేలూరులోని

Robbery: హాలీవుడ్ సినిమాను తలపించిన భారీ దోపిడి.. డ్రైనేజ్ పగులగొట్టి.. ఏసీ పైప్‌ల నుంచి దూరి..
Robbery
Follow us

|

Updated on: Dec 15, 2021 | 7:10 PM

Massive robbery in Vellore district: తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కోట్లలో బంగారం, వజ్రాలు దోపిడీ చేశారు. ఈ భారీ దోపిడీ ఘటన వేలూరులోని జోస్ అలుకాస్ నగల దుకాణంలో చోటుచేసుకుంది. మురుగు కాలువ ద్వారా వజ్రాలు, బంగారు ఆభరణాల దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో నిఘా కెమెరాలన్నింటినీ స్ప్రే చేసి దుండగులు అత్యాధునికంగా దొంగతానానకి పాల్పడ్డారని వేల్లూర్ పోలీసులు తెలిపారు. జోస్ అలుకాస్ జ్యువెలరీ షాపు.. వెల్లూరు జిల్లా కేంద్రంలోని కాట్పాడి రోడ్డులో ఉంది. ఉదయం యథావిధిగా సిబ్బంది దుకాణం తెరిచి షాక్‌కు గురయ్యారు. దుకాణం వెనుక ఉన్న మురుగు కాలువను పగులగొట్టి దుండగులు.. సెల్లార్‌ ద్వారా నగల దుకాణంలోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీ పైప్ ల ద్వారా ప్రవేశించిన దొంగలు సుమారు 35 కిలోల వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు యాజమాన్యం పేర్కొంది. నగల దుకాణంలో ఉంచిన కెమెరాలపై స్ప్రే కొట్టడంతో దొంగల చిత్రాలను ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నారు.

సంఘటనా స్థలాన్ని వేలూరు పోలీస్ డిప్యూటీ చీఫ్ బాబు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కన్నా పరిశీలించారు. స్నిఫర్ డాగ్ ద్వారా అన్వేషణ కొనసాగుతోంది. ఈ ఘటన అనంతరం దుకాణంలోని ఉద్యోగుల నుంచి కూడా పోలీసులు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులంతా రెండో అంతస్తులో ఉంటున్నారు. ప్రధాన రహదారిపై నలుగురు కాపలా ఉన్నప్పటికీ దోపిడీ జరగడం గమనార్హం. షాప్ మొత్తం సెంట్రల్ ఏసీ కావడంతో గాలి బయటికిపోవడానికి పెద్ద పైప్ లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి దుండగులు షాపులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. కోట్లాది రూపాయల దోపిడి జరిగిందని పోలీసులు తెలిపారు. అంతకుముందు తిరుచ్చిలోని లలితా జ్యూయలరీలో ఇదే విధంగా దోపిడీ జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read:

RTC Bus Accident: తృటిలో తప్పిన మరో పెను ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

YS Jagan: పదికి చేరిన జల్లేరు మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్