AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శవం కళ్లు ఎమ్మయ్యాయో తెలుసా..?

శవం కళ్లు..ఎలుకల భోక్తం కోల్‌కత్తాలోని ఓ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి కళ్లు మాయం అయ్యాయి. మృతదేహం ముఖంలో రెండు కళ్లు లేకపోవడంతోబంధువులు,కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో జరిగిన ఘటనపై దర్యాప్తు చేప్టటిన అధికారులు కంగుతినే నిజం వెల్లడించారు. 69 ఏళ్ల శంభునాథ్‌ దాస్‌ అనే వృద్దుడు రోడ్డుప్రమాదంలో మరణించాడు. శంభునాథ్‌ మృతదేహన్ని ఆస్పత్రికి తరలించిన పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీని మార్చురీకితరలించారు. అయితే, మార్చురీలో ఎలుకలు, పెద్ద పెద్ద పందికొక్కులు స్వైర […]

ఈ శవం కళ్లు ఎమ్మయ్యాయో తెలుసా..?
Pardhasaradhi Peri
|

Updated on: Aug 21, 2019 | 3:17 PM

Share

శవం కళ్లు..ఎలుకల భోక్తం కోల్‌కత్తాలోని ఓ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి కళ్లు మాయం అయ్యాయి. మృతదేహం ముఖంలో రెండు కళ్లు లేకపోవడంతోబంధువులు,కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో జరిగిన ఘటనపై దర్యాప్తు చేప్టటిన అధికారులు కంగుతినే నిజం వెల్లడించారు.

69 ఏళ్ల శంభునాథ్‌ దాస్‌ అనే వృద్దుడు రోడ్డుప్రమాదంలో మరణించాడు. శంభునాథ్‌ మృతదేహన్ని ఆస్పత్రికి తరలించిన పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీని మార్చురీకితరలించారు. అయితే, మార్చురీలో ఎలుకలు, పెద్ద పెద్ద పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. అవి శంభునాథ్‌ శవంపై దాడిచేసి అతని రెండు కళ్లను తినేశాయట. అది గమనించలేనిఆస్పత్రి సిబ్బంది మృతదేహన్ని అతడి బంధువులకు అప్పగించారు. కళ్లు లేని తమ తండ్రి శవంతో కొడుకు ఆందోళనకు దిగాడు. జరిగిన ఘటనపై సరైన సమాధానం కావాలని డిమాండ్‌ చేయడంతో సదరు ఆస్పత్రిలోని  పై అధికారులు ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తుకు ఆదేశించారు. మార్చురీలో ఎలుకలు తిరుగుతున్నాయనే మాట వాస్తవేనని, వాటినితరిమికొట్టేందుకు ప్రయత్నాల జరుగుతున్నాయని తెలిపారు.