AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతిస్థిమితం లేని యువకుడు..అక్కకు ఫోన్ చేసి..

జగిత్యాల జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగా లేని ఓ యువకుడు తన అక్కకు ఫోన్ చేసి...‘అక్కా నాకు బతకాలని లేదు, నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా’అని చెప్పి...

మతిస్థిమితం లేని యువకుడు..అక్కకు ఫోన్ చేసి..
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2020 | 3:39 PM

Share

జగిత్యాల జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగా లేని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అందరనీ కలచివేసింది. జిల్లాలోని బీర్‌పూర్ మండల కేంద్రం… శివారు గ్రామ సిరిపురంలో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్కా నాకు బతకాలని లేదు… బావిలో దూకి చనిపోతున్నా’ అంటూ తన అక్కకు చివరగా ఫోన్‌ చేసి చెప్పాడు. అనంతరం అతడి ఫోన్ పనిచేయలేదు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

సిరిపురం గ్రామానికి చెందిన పర్స లింగన్న- కళావతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లలో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా, కొడుకు కూతురు చదువుకుంటున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన కొడుక్కి గత కొద్ది రోజులుగా మతిస్థమితం సరిగా లేక భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు..మంచిర్యాలలో ఉంటున్న అక్కకు ఫోన్ చేశాడని తెలిపారు. ‘అక్కా నాకు బతకాలని లేదు, నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా’అని చెప్పి జై శ్రీరాం అంటూ ఫోన్ స్విచ్‌ఫ్ చేసి బావిలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. దీంతో వెంటనే ఆమె తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారు సమీపంలోని బావులన్నింటినీ గాలించారు. బీర్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై మనోహర్ రావు సిబ్బందితో పాటు, గ్రామస్తులతో బావుల వద్దకు చేరుకుని గాలించారు. చివరకు ఓ బావి వద్ద బాధితుడి చెప్పులు కనిపించడంతో బావిలో గాలించగా, మ‌ృతదేహాం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.