AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: పెళ్లి రోజు భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు.. పోలీసులకు ఆరా తీయగా ఊహించని షాక్.!

ఓ ప్రభుద్దుడు తన పెళ్లి రోజు నాడు భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న...

Karnataka: పెళ్లి రోజు భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు.. పోలీసులకు ఆరా తీయగా ఊహించని షాక్.!
Crime
Ravi Kiran
|

Updated on: Jan 08, 2022 | 9:19 AM

Share

ఓ ప్రభుద్దుడు తన పెళ్లి రోజు నాడు భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి ఇంటిని పరిశీలించగా వారికి ఊహించని షాక్ తగిలింది. దీనితో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా.. పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఏంటంటే..

కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా కోణనూరు గ్రామలో సుమ, నారప్ప దంపతులు నివాసముంటున్నారు. గతేడాది డిసెంబర్ 25వ తేదీ వీరిద్దరి పెళ్లి రోజు. సాధారణంగా పెళ్లి రోజు అనగానే భార్యను కానుకలతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు భర్తలు. అయితే ఇతగాడు ఏకంగా భార్య కిరాతకంగా హత్య చేసి బాత్‌రూమ్‌లో గొయ్యి తవ్వి ప్లాస్టింగ్ వేసి పాతిపెట్టాడు. ఏమి తెలియనట్లుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఇంటిని తనిఖీ చేయగా.. అసలు విషయం బయటపడింది. దీనితో తానే హత్య చేసినట్లుగా నిందితుడు తప్పును ఒప్పుకున్నాడు. అతడిపై వరకట్న వేధింపులు, హత్య కేసులను నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!