AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో బయటపడ్డ ల్యాబ్ భాగోతం.. తప్పుడు రిపోర్టులతో మోసం..

ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ ల్యాబ్ భాగోతం బయటపడింది. కాసులకు కక్కుర్తితో జనం జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోగల ఒక పాథాలజీ ల్యాబ్ కరోనా నెగిటివ్ ఉన్నవారిని కరోనా పాజిటివ్‌గా చూపించిన ఘటన కలకలం రేపింది.

యూపీలో బయటపడ్డ ల్యాబ్ భాగోతం.. తప్పుడు రిపోర్టులతో మోసం..
Balaraju Goud
|

Updated on: Sep 24, 2020 | 12:17 PM

Share

ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ ల్యాబ్ భాగోతం బయటపడింది. కాసులకు కక్కుర్తితో జనం జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోగల ఒక పాథాలజీ ల్యాబ్ కరోనా నెగిటివ్ ఉన్నవారిని కరోనా పాజిటివ్‌గా చూపించిన ఘటన కలకలం రేపింది. ఈ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న 30 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే, వీరంతా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ ఉదంతంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

స్వరూప్ నగర్‌కు చెందిన ఓ బాధితుడు కరోనా లక్షణాలు కనిపించడంతో సమీపంలోని పాథాలజీ ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే, అనుమానం వచ్చిన బాధితుడు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ గా తేలింది. దీంతో ఆ బాధితుడు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ల్యాబ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో పాథాలజీ ల్యాబ్‌పై జిల్లా వైద్యాధికారి అలోక్ తివారి, సీఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రాలు దాడి చేశారు. డీఎం అలోక్ తివారి స్వయంగా రంగంలోకి దిగి ఆ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న కొంతమంది బాధితుల ఫోను నంబర్లు, చిరునామాలు తీసుకుని పరిశీలించగా అవి తప్పుడు సమాచారంతో కూడుకున్నవని తేలింది. దీనికితోడు ఆ ల్యాబ్‌లో మరిన్ని అవకతవకలు జరగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ వచ్చిన కొంతమందికి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ల్యాబ్‌లో జరిగిన అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా వైద్యాధికారి అధికారులను ఆదేశించారు.