AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా

Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్
DGP In RJY
Venkata Narayana
|

Updated on: Oct 26, 2021 | 4:53 PM

Share

AP DGP: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని డీజీపీ చెప్పుకొచ్చారు.

ఎన్.ఐ.ఎ. సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సాగుపై లోతుగా మాట్లాడారు.  గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2లక్షాల 90వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న డీజీపీ, గత పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read also: RGV: నాతో మాట్లాడించొద్దు.. ఆ ‘పదం’ అర్థం తెలీదన్న రామ్ గోపాల్ వర్మ..