AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య మాజీ పీఏకు మూడేళ్ల జైలు శిక్ష

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గతంలో పీఏగా వ్యవహరించిన శేఖర్‌కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2008లోనే శేఖర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలోని  పలు ప్రాంతాల్లో దాదాపు కోటిన్నర విలువైన అక్రమ ఆస్తులున్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంతో శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో సూపర్ వైజర్‌గా […]

బాలయ్య మాజీ పీఏకు మూడేళ్ల జైలు శిక్ష
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2019 | 6:17 PM

Share

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గతంలో పీఏగా వ్యవహరించిన శేఖర్‌కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2008లోనే శేఖర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలోని  పలు ప్రాంతాల్లో దాదాపు కోటిన్నర విలువైన అక్రమ ఆస్తులున్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంతో శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు.

తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో సూపర్ వైజర్‌గా చేరిన శేఖర్ వివిధ హోదాల్లో పని చేశారు. అనంతరం 2014లో హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణకు పీఏగా పని చేశాడు. ఆ సమయంలో అతనిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. షాడో ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో..బాలక‌ృష్ణ ఆయన్ను తొలగించారు. ప్రస్తుతం శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.