Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది..

Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2021 | 6:33 AM

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మదాపురం సమీపంలోని జాతీయ రహదారిపై మినీ బస్సును లారీ ఢికొంది. బస్సు చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారి సహా ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మినీ బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ దర్గాకి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని.. మృతులంతా ముస్లిములేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

ఇస్రో చైర్మన్‌ శివన్‌పై విజిలెన్స్‌ కేసు.. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడికి జాబ్ ఇచ్చారంటూ ఫిర్యాదు..