Telangana: సంచలనం.. తెలంగాణలోని ఆ మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు మిస్సింగ్

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మల్యాల మండలం తక్కలపెల్లి...

Telangana: సంచలనం.. తెలంగాణలోని ఆ మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు మిస్సింగ్
3 Women Missing
Follow us

|

Updated on: Jul 29, 2021 | 1:13 PM

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రూప, అదే గ్రామానికి చెందిన సూర్య కళ… మానాల గ్రామంకు చెందిన సుమలత ఒకే రోజు కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు మహిళలు ఒకే రోజు అదృశ్యం అవ్వడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేదా వారే కావాలని ఎక్కడికైనా వెళ్లారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మిస్సైన ముగ్గురు మహిళల్లో.. ఒకరితో మరొకరి సంబంధం ఉందా అనే యాంగిల్‌లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా కేసులను సవాల్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. మిస్ అయినవారి ఆచూకి తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోటోల్లో ఉన్న మహిళలు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

సైబర్ నేరాల గురించి 24 గంటలు పనిచేసేలా హెల్ప్‌లైన్‌

దేశవ్యాప్తంగా 2019లో 44,546 సైబర్‌ నేరాలు నమోదైతే వాటిలో 26,891 (60.4 శాతం) ఆర్థిక సంబంధ నేరాలే. తెలంగాణలోనూ మొత్తం 2,691 కేసుల్లో 2013 (70.4 శాతం) ఈ తరహావే. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబరు 155260ను అందుబాటులోకి తెచ్చింది. లేదంటే జాతీయ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ www.cybercrime.gov.inకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైన వివరాలు చెప్పాక బాధితులకు సంక్షిప్త సందేశం లేదా మెయిల్‌ ద్వారా లాగిన్‌ ఐడీ/ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా www.cybercrime.gov.inకు 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలి.

Also Read: సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్‌ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు

 హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..