AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జేడీ నాయకులపై కాల్పులు..

బీహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. కంతి గ్రామంలో రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని సురేంద్ర యాదవ్‌, ఉమాశంకర్‌ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. వీరి శరీరం నుంచి బుల్లెట్లను తొలగించినట్లు వైద్యులు.. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. […]

ఆర్జేడీ నాయకులపై కాల్పులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2019 | 12:30 PM

Share

బీహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. కంతి గ్రామంలో రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని సురేంద్ర యాదవ్‌, ఉమాశంకర్‌ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. వీరి శరీరం నుంచి బుల్లెట్లను తొలగించినట్లు వైద్యులు.. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.