AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. పొలంలో గడ్డి మేస్తుందని ఆవుదూడను కర్రలతో కొట్టి..

ఓ వైపు గోవధ నిషేధంపై యూపీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. సీన్ మాత్రం మారడం లేదు. యూపీలోని ఆగ్రా పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

దారుణం.. పొలంలో గడ్డి మేస్తుందని ఆవుదూడను కర్రలతో కొట్టి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 3:32 PM

Share

ఓ వైపు గోవధ నిషేధంపై యూపీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. సీన్ మాత్రం మారడం లేదు. యూపీలోని ఆగ్రా పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆవుదూడ తమ పొలంలో గడ్డి మేస్తుందన్న కారణంతో దారుణంగా కర్రలతో కొట్టి హింసించారు. దీంతో ఆ ఆవుదూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది. మంగళవారం రోజే గోవధ నివారణ చట్టం పేరిట ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆగ్రా నగర శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని.. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ఆవుదూడపై దాడి చేసిన రవి, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిపై సెక్షన్‌ 429 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, తొలిసారి గోవును వధిస్తే.. ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా.. రూ.1 లక్ష నుంచి రూ. 3లక్షల వరకు జరిమానా విధించనున్నారు. రెండో సారి కూడా నేరానికి పాల్పడితే.. పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు.. రూ.5 లక్షల జరిమానా విధించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ కూడా సంతకం చేశారు.