యూవీ హార్ట్ టచింగ్ పోస్ట్కు మాజీ ప్రేయసి కామెంట్
టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు గుర్తు చేసుకున్నారు. ‘మిస్ యూ యూవీ’ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా తనను గుర్తుచేసుకున్న అభిమానులకు యువీ స్పెషల్ థాంక్స్ చెప్పారు. “ప్రియమైన అభిమానులారా.. మీ ఆప్యాయతకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్పై […]
టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు గుర్తు చేసుకున్నారు. ‘మిస్ యూ యూవీ’ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా తనను గుర్తుచేసుకున్న అభిమానులకు యువీ స్పెషల్ థాంక్స్ చెప్పారు.
“ప్రియమైన అభిమానులారా.. మీ ఆప్యాయతకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి…”అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అయితే యువీ ఉద్వేగంగా చేసిన ఈ పోస్ట్పై అతడి మాజీ ప్రేయసి కిమ్ శర్మ స్పందించారు. ‘గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అంటూ కామెంట్ చేశారు. అయితే కిమ్ చేసిన కామెంట్పై యూవీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇది కూడా వైరల్గా మారింది.
మొత్తానికి చాలా కాలం తర్వాత యూవీని కిమ్ విష్ చేయటం…ఈ సందర్భంగా కిమ్ శర్మ, సిక్సర్ల వీరుడు యూవీల ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు. కిమ్ శర్మ తెలుగు అభిమానులకు సుపరిచితమన హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ చిత్రంలో హీరోయిన్గా నటించారు.