ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు వాయిదా..తిరిగి ఎప్పుడంటే..
తెలంగాణలో ఎంసెట్, సహా ఇతర ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మరో నెల ముందుకు జరిపి,ఈ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించే యోచనలో ఉంది. కరోనా అంతకంతకూ ప్రబలుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను ఈ నెల 30తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి […]
తెలంగాణలో ఎంసెట్, సహా ఇతర ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మరో నెల ముందుకు జరిపి,ఈ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించే యోచనలో ఉంది. కరోనా అంతకంతకూ ప్రబలుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను ఈ నెల 30తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి మే నెలలో ఎంసెట్తోపాటు అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడడంతో ఈ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా లాక్డౌన్ను పొడగించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న గడువును మే 5తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షులు పాపిరెడ్డి ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 4 నుంచి మూడు రోజులపాటు ఎంసెట్ను, తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజులపాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. దీంతోపాటు ఈసెట్ను మే 2న , పీజీఈసెట్ను మే 28 నుంచి 31తేదీ వరకు, ఐసెట్ను మే 20, 21 తేదీల్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్టును మే 13న, లాసెట్, పీజీ లాసెట్ను మే 27న ,ఎడ్సెట్ను మే 23న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసి విద్యార్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. మే 2 నుంచి 31 తేదీల మధ్య ఈ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా, లాక్డౌన్ కారణంతో ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ప్రవేశ పరీక్షలు మరోసారి వాయిదా వేస్తున్నట్లు మండలి ప్రకటించింది.