రాజకీయ నేతలు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలే..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పలువురు రాజకీయ నేతలు.. సేవల పేరుతో ఈ నిబంధనలను తుంగలొ తొక్కేస్తున్నారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌తో పాటు.. లాక్‌డౌన్‌కు సమస్య అవతుందని.. హర్యానా హోం మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ నేతలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ.. నాయకుడికి వ్యతిరేకం కాదని.. […]

రాజకీయ నేతలు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలే..!

Edited By:

Updated on: Apr 23, 2020 | 9:04 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పలువురు రాజకీయ నేతలు.. సేవల పేరుతో ఈ నిబంధనలను తుంగలొ తొక్కేస్తున్నారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌తో పాటు.. లాక్‌డౌన్‌కు సమస్య అవతుందని.. హర్యానా హోం మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ నేతలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ.. నాయకుడికి వ్యతిరేకం కాదని.. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కఠినతరం చేసేందుకే ఈ ఆదేశాలని తెలిపారు. ఇకపై లాక్‌డౌన్‌ ఉల్లంఘించే రాజకీయ నేతలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.