తొమ్మిదిమంది స్టార్ డైరెక్టర్స్తో.. వెబ్ సిరీస్లోకి హీరో సూర్య..
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. అందులోనూ వెబ్ సిరీస్లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్లలో..

కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. అందులోనూ వెబ్ సిరీస్లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్లలో కనిపిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని సమంత కూడా ద ఫ్యామిలీ మ్యాన్-2లో నటించింది.
అయితే ఇప్పుడు తాజాగా తమిళ్ నేచురల్ స్టార్ హీరో సూర్య కూడా వెబ్ సిరీస్లోకి అడుగు పెట్టబోతున్నారు. ‘నవ రసం’ అనే పేరుతో వస్తున్న వెబ్ సిరీస్లో ఈ స్టార్ హీరో నటించబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. 9 ఎపిసోడ్లు ఉండే ఈ సరిస్లో కొంతమంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా గెస్ట్లుగా కనిపించబోతున్నారట. విక్రమ్, మాధవన్, సిద్ధార్థ వంటి స్టార్ హీరోలు.. ఈ వెబ్ సిరీస్లోని పలు సన్నివేశాల్లో గెస్ట్ అఫీయరెన్స్ ఇవ్వబోతున్నారట.
అలాగే ఈ సిరీస్లోని ఒక్కో ఎపిసోడ్ను ఒక్కో డైరెక్టర్తో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ లిస్ట్లో మణిరత్నంతో పాటు గౌత్ మీనన్, బిజోయ్ నంబియార్, అరవింద్ స్వామి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గ్రాండ్ లాంచ్తో హీరో సూర్య వెబ్ సిరీస్లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More:
హైదరాబాద్లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..