బ్యాటరీ రిక్షాలో ‘సామాజిక దూరం ‘..వారేవా !
కరోనా ఉధృతి సమయంలో సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇందుకు నిదర్శనంగా బ్యాటరీతో నడిచే ‘ఈజీ బైక్’ (ఈ-రిక్షా) ని డ్రైవర్ ప్రయాణికులెవరూ డైరెక్ట్ టచ్ లోకి రాకుండా తన వాహనాన్ని నాలుగు భాగాలుగా ఎలా విభజించాడో ఆయన వీడియో ద్వారా చూపారు. ఇందులో నలుగురు ప్రయాణికులు వేర్వేరుగా కూర్చోవలసిందే. ‘మనోళ్ల కొత్త కొత్త ఐడియాలు బ్రహ్మాండం ! మారుతున్న పరిస్థితులకు తగినట్టు నడుచుకుంటారు’ అని […]

కరోనా ఉధృతి సమయంలో సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఇందుకు నిదర్శనంగా బ్యాటరీతో నడిచే ‘ఈజీ బైక్’ (ఈ-రిక్షా) ని డ్రైవర్ ప్రయాణికులెవరూ డైరెక్ట్ టచ్ లోకి రాకుండా తన వాహనాన్ని నాలుగు భాగాలుగా ఎలా విభజించాడో ఆయన వీడియో ద్వారా చూపారు. ఇందులో నలుగురు ప్రయాణికులు వేర్వేరుగా కూర్చోవలసిందే. ‘మనోళ్ల కొత్త కొత్త ఐడియాలు బ్రహ్మాండం ! మారుతున్న పరిస్థితులకు తగినట్టు నడుచుకుంటారు’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
The capabilities of our people to rapidly innovate & adapt to new circumstances never ceases to amaze me. @rajesh664 we need to get him as an advisor to our R&D & product development teams! pic.twitter.com/ssFZUyvMr9
— anand mahindra (@anandmahindra) April 24, 2020