Narendra Modi: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నాహాలు..!

India COVID-19 situation: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడు వేలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు

Narendra Modi: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నాహాలు..!
Pm Narendra Modi
Follow us

|

Updated on: Apr 30, 2021 | 8:34 AM

India COVID-19 situation: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మూడు వేలకుపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, కరోనా వ్యాక్సిన్, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, అత్యవసరమైన ఔషధాలు తదితర ముఖ్యమైన అంశాలపై మంత్రులతో, అధికారులతో చర్చించనున్నారు.

కాగా.. కరోనా మహమ్మారిని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని మోదీ దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమవుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమై ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను తగ్గించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం పీఎం కేర్‌ నుంచి నిధులు విడుదల చేసింది. అలాగే దేశంలోని పలు ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌‌ను సరఫరా చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు పలు దేశాల నుంచి ఔషధ సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల దిగుమతిపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

అయితే.. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న దృష్ట్యా మరోసారి లాక్‌డౌన్ ఉంటుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఉండదంటూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పలు అధ్యయనాలు.. మే నెలలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుందని.. మరణాలు కూడా 5వేలు దాటుతాయని హెచ్చరించాయి. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి కట్టడికి.. మరో లాక్‌డౌన్ తప్పదంటూ సంకేతాలు ఇచ్చాయి. ఈ తరుణంలో.. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:

Horoscope Today: ఆ రాశుల వారందరికీ వ్యతిరేక ఫలితాలే.. శుక్రవారం రాశి ఫలాలు ..

Petrol, Diesel price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే మార్పులు

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు