Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా సోకుతుంది.. కానీ.. గ‌ణంకాల్లో ఆస‌క్తిక‌ర విష‌యాల వెల్ల‌డి..

Corona Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డంలేదు. సెకండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభిస్తోన్న ఈ రాకాసి వంద‌ల సంఖ్య‌లో జ‌నాల‌ను పొట్ట‌న పెట్టుకుంటోంది. ఇదిలా...

Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా సోకుతుంది.. కానీ.. గ‌ణంకాల్లో ఆస‌క్తిక‌ర విష‌యాల వెల్ల‌డి..
Covid Vaccine
Follow us

|

Updated on: Apr 22, 2021 | 10:34 AM

Corona Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ స‌మాజాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డంలేదు. సెకండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభిస్తోన్న ఈ రాకాసి వంద‌ల సంఖ్య‌లో జ‌నాల‌ను పొట్ట‌న పెట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేష‌న్ తీసుకున్న వారికి కూడా క‌రోనా సోకుతుండ‌డంతో ఆందోళ‌న నెల‌కొంది. అయితే తాజాగా వెల్ల‌డైన గ‌ణంకాల ప్ర‌కారం కోవాక్జిన్ సెకండ్ డోస్ తీసుకున్న వారిలో కేవ‌లం 0.04 శాతం మందికి మాత్ర‌మే క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఇక కోవిషీల్డ్ తీసుకున్న వారి విష‌యానికొస్తే ఇది కేవ‌లం 0.03 శాతం మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్‌) అందించిన డేటా ఆధారంగా ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై ఐసీఎమ్ఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బాల‌రామ్ భార్గ‌వ మాట్లాడుతూ.. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న ప‌దివేల మందిలో కేవ‌లం 2 – 4గురు మాత్ర‌మే క‌రోనా బారిన ప‌డుతున్నారని తెలిపారు. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత వైర‌స్ బారిన ప‌డుతోన్న వారి సంఖ్య చాలా త‌క్కువని నీతి ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఒక‌వేళ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారిలో కూడా పెద్ద‌గా ఆందోళ చెందాల్సిన స్థాయిలో వైర‌స్ ప్ర‌భావం ఉండ‌డంలేద‌ని వివ‌రించారు. ఇదిలా ఉంటే కోవిషీల్డ్‌, కోవాక్జిన్ వ్యాక్సిన్ల రెండు డోస్‌లు తీసుకున్న 10 నుంచి 15 రోజుల త‌ర్వాతే శ‌రీరానికి స‌రిప‌డ యాంటీ బాడీస్ ఉత్ప‌త్తి అవుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోవాగ్జిన్‌ను దేశంలో సుమారు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. వీరిలో 93 ల‌క్ష‌ల మంది మొద‌టి డోస్ తీసుకోగా.. 17 ల‌క్ష‌ల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. మొద‌టి డోస్ తీసుకున్న 93 ల‌క్ష‌ల మందిలో 4,208 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక సెకండ్ డోస్ తీసుకున్న 17 ల‌క్ష‌ల మందిలో 695 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఇక కోవిషీల్డ్ విష‌యానికొస్తే.. ఈ వ్యాక్సిన్ మొద‌టి డోస్‌ను 10 కోట్ల మంది తీసుకోగా.. వీరిలో 17,415 మందికి క‌రోనా సోకింది. అలాగే సెకండ్ డోస్‌ను 1.5 కోట్ల మంది తీసుకోగా వీరిలో 5,104 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. అందులోనూ క‌రోనా బారిన ప‌డ‌డానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు క‌రోనా ఎక్కువ‌గా సోకుతున్న‌ట్లు లెక్క‌ల్లో తేలింది. ఈ లెక్క‌న వ్యాక్సిన్ అనేది చాలా వ‌ర‌కు వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో విజ‌య‌వంత‌మ‌వుతుందని తేలింది.

Also Read: Sensex: కరోనా ఉగ్రరూపంతో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Rafale Jets: భారత్‌కు చేరుకున్న ఐదో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఐఏఎఫ్ చీఫ్

Telangana corona: తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 5,567 మందికి పాజిటివ్, 23 మంది మృతి

Latest Articles
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??