AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరధిలో కరోనా ఉధృతి మామూలుగా లేదు. రోజుకూ వెయ్యికి దగ్గరలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ...

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2020 | 5:00 PM

Share

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరధిలో కరోనా ఉధృతి మామూలుగా లేదు. రోజుకూ వెయ్యికి దగ్గరలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మెడికల్ షాపులు ఉండబోతున్నాయి. రేపటి నుంచి జులై 15వ తేదీ వరకూ ఇదే విధంగా మెడికల్ షాపులు ఓపెన్ చేయనున్నట్లు మెడికల్ షాపు ఓనర్‌లు పేర్కొన్నారు. మెడికల్ షాప్ సిబ్బంది కూడా కరోనా సోకుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెడికల్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది.

కాగా తెలంగాణలో కరోనా విజృంభణ అధికమవుతోంది. శనివారం 3,923 కరోనా టెస్ట్‌లు జరగ్గా.. 1,087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,436కు చేరింది. అలాగే 162 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,928కు చేరింది. కరోనాతో తాజాగా ఆరు మంది చనిపోగా.. మృతుల సంఖ్య 243కు చేరింది. 8,265 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధికంగా 888 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 5, కరీంనగర్‌లో 5, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, వరంగల్‌ అర్బన్‌లో 7, మహబూబ్‌నగర్‌లో 5, నాగర్‌కర్నూల్‌లో 4, అసిఫాబాద్‌లో 1, ఖమ్మంలో 1,వనపర్తిలో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 2, మహబూబాబాద్‌లో 1, జనగాంలో 4, మంచిర్యాలలో 1 కేసు నమోదైంది.

Read More:

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..