Manmohan Singh tests positive : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స

Manmohan Singh tests positive : రెండో దశలో కరోనా మహమ్మారి భారతదేశంలో కరాళ నృత్యం చేస్తోంది...

Manmohan Singh tests positive : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స
Manmohan
Follow us

|

Updated on: Apr 19, 2021 | 7:42 PM

Manmohan Singh tests positive : రెండో దశలో కరోనా మహమ్మారి భారతదేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్ వైరస్ దేశంలోని మహామహా ప్రముఖులకు కూడా సోకుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా, అటు, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. దీంతో మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీల కతీతంగా వివిధ పార్టీల కీలకనేతలు తమ సందేశాలిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలని తమ తమ ఆకాంక్షలను వివిధ రూపాల్లో సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా, కోవిడ్ నియంత్రణ ఇలా చేయొచ్చంటూ కేంద్రానికి మన్మోహన్ పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని మన్మోహన్ తన సూత్రాల ద్వారా పేర్కొన్నారు.

ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు. కాగా, మన్మోహన్ కరోనాను జయించి త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, చిదంబరం వ్యక్తం చేయగా, అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా అనేక మంది నేతలు మన్మోహన్ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు