AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్.. జూమ్ కాల్ ద్వారా డ్రగ్గిస్టుకు మరణ శిక్ష

సింగపూర్ లో మొట్టమొదటిసారిగా ఓ డ్రగ్ స్మగ్లర్ కి జూమ్ కాల్ ద్వారా మరణశిక్ష విధించారు. 37 ఏళ్ళ పునీతన్ గణేశన్ అనే వ్యక్తి హెరాయిన్ ని అక్రమ రవాణా చేస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా అతడికి జూమ్ కాల్ ద్వారా ఉరి శిక్ష విధించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో రిమోట్ గా ఒక కేసులో తీర్పు రావడం ఇదే తొలిసారి అని ఈవర్గాలు పేర్కొన్నాయి. గణేశన్ ని […]

సింగపూర్.. జూమ్ కాల్ ద్వారా డ్రగ్గిస్టుకు మరణ శిక్ష
Umakanth Rao
| Edited By: |

Updated on: May 20, 2020 | 3:37 PM

Share

సింగపూర్ లో మొట్టమొదటిసారిగా ఓ డ్రగ్ స్మగ్లర్ కి జూమ్ కాల్ ద్వారా మరణశిక్ష విధించారు. 37 ఏళ్ళ పునీతన్ గణేశన్ అనే వ్యక్తి హెరాయిన్ ని అక్రమ రవాణా చేస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా అతడికి జూమ్ కాల్ ద్వారా ఉరి శిక్ష విధించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో రిమోట్ గా ఒక కేసులో తీర్పు రావడం ఇదే తొలిసారి అని ఈవర్గాలు పేర్కొన్నాయి. గణేశన్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించినట్టు సింగపూర్ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ తరహాలో ఇది మొదటి క్రిమినల్ కేసని ఆయన చెప్పారు. కాగా ఈ తీర్పుపై తన క్లయింటు అప్పీలు చేస్తాడని అతని తరఫు లాయర్ పీటర్ ఫెర్నాండో పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని జూమ్ టెక్ సంస్థ ఈ తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. లాక్ డౌన్ కారణంగా సింగపూర్ లో అనేక కోర్టు తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ దేశంలో అక్రమ డ్రగ్ రవాణాదారులకు కఠిన శిక్షలు విధిస్తారు. గతంలో అనేకమందిని ఉరి తీశారు.