ఇక డెడ్బాడీస్కు కోవిడ్ పరీక్షలు బంద్.. మహా ప్రభుత్వ నిర్ణయం..
మృతదేహాలకు కోవిడ్ పరీక్షలు బంద్ చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా వైరస్ అనుమానిత డెడ్బాడీస్కు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మృతదేహాలకు చేసే టెస్టుల్లో సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ..
మృతదేహాలకు కోవిడ్ పరీక్షలు బంద్ చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా వైరస్ అనుమానిత డెడ్బాడీస్కు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మృతదేహాలకు చేసే టెస్టుల్లో సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ మృతుల బంధువులు చేస్తోన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కరోనా అనుమానిత మృతదేహాలన్నింటికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జరీ చేసింది. మృతుల కాంటాక్ట్స్ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వ్యాస్ పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉంటూ మరణించి, కరోనా లక్షణాలు ఉన్న వారి మృతదేహాలకు మాత్రమే పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. రిపోర్టులు వచ్చేంత వరకూ ఆగకుండా వైరస్ అనుమానితుల డెడ్బాడీలను వారి కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Read More: ఏపీ సర్కార్ సంచలనం.. అప్లై చేసిన పది పనిదినాల్లో పెన్షన్…