కరోనావైరస్ హాట్ స్పాట్స్ కోయంబేడు.. ధారావి
మహారాష్ట్రలోని ధారావి, తమిళనాడులోని కోయంబేడు కరోనా వైరస్ హాట్ స్పాట్స్ గా మారాయి. ధారావితో పోలిస్తే.. కోయంబేడు పరిస్థితి మరీ ఘోరం.. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్..లో తాజాగా సుమారు 425 కరోనా కేసులు నమోదయ్యాయంటే ఆందోళన కలిగించక మానదు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ మార్కెట్ నుంచే కాయగూరలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి అవుతుంటాయి. ముఖాలకు ఎలాంటి మాస్కులు లేకుండా రోజూ వందలాది […]
మహారాష్ట్రలోని ధారావి, తమిళనాడులోని కోయంబేడు కరోనా వైరస్ హాట్ స్పాట్స్ గా మారాయి. ధారావితో పోలిస్తే.. కోయంబేడు పరిస్థితి మరీ ఘోరం.. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్..లో తాజాగా సుమారు 425 కరోనా కేసులు నమోదయ్యాయంటే ఆందోళన కలిగించక మానదు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ మార్కెట్ నుంచే కాయగూరలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి అవుతుంటాయి. ముఖాలకు ఎలాంటి మాస్కులు లేకుండా రోజూ వందలాది ప్రజలు ఈ మార్కెట్ ని విజిట్ చేస్తుంటారు. సోషల్ డిస్టెన్స్ అన్న పదానికి అక్కడ అర్థమే ఉండదు. తమిళనాడు లోని అనేక ప్రాంతాలనుంచి ఈ మార్కెట్ కి ప్రతి రోజూ కొన్ని వందల టన్నుల సరకులు రవాణా అవుతుంటాయి. కరోనా విలయతాండవం చేస్తున్నా ఇక్కడ ఎవరికీ పట్టదు. దగ్గరలోని విల్లుపురం కూడా సుమారు రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, వాటికి ఈ మార్కెట్ తో లింక్ ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక ముంబైలోని ధారావి స్లమ్ ఏరియాలో సుమారు తొమ్మిది లక్షల జనాభా ఉన్నారు. ఈ మురికివాడలో ఉంటున్నవారంతా చిన్నా, చితకా పనులు చేసుకుని జీవించేవారే. ఇక్కడ కూడా సామాజిక దూరం పాటింపు అన్నది ఉండదు. ఈ మురికివాడలో మంగళవారం 40 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ముంబై.. ధారావి కరోనా కేసులకు ‘అన్ పాపులర్’ అయ్యాయి. రాష్ట్రంలో 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే వీటిలో ఎక్కువ భాగం ఈ రెండు ప్రాంతాలవే కావడం గమనార్హం.