AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ అద‌ృశ్యం..!

ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రస్తుతం గజగజ వణికిపోతున్నాడు..భయంతో కిమ్‌ పత్తా లేకుండా పోయారట.. అవును.. నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జామ్‌ ఉన్‌ పరార్‌ అయ్యారు. ప్రాణభయంతో జడుసుకొని రాజధాని విడిచి వెళ్లిపోయారట..

నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ అద‌ృశ్యం..!
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2020 | 7:50 AM

Share

ఆయన ఐదడుగుల బుల్లెట్టు.. అతని పేరు చెబితే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది.. ఆ పేరెత్తితే అగ్రరాజ్యాధినేతకు సైతం కంటిమీద కునుకు కరువవుతుంది.. అంతటి ధైర్యశాలిగా పేరుగడించిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రస్తుతం గజగజ వణికిపోతున్నాడు..భయంతో కిమ్‌ పత్తా లేకుండా పోయారు. ఇంతకీ కిమ్‌కి వెంటాడుతున్నదేవరు..? అతడి అదృశ్యం వెనుక అసలు కారణం ఏంటీ..?

అవును.. నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జామ్‌ ఉన్‌ పరార్‌ అయ్యారు. ప్రాణభయంతో జడుసుకొని రాజధాని విడిచి వెళ్లిపోయారు. ఆ మహమ్మారితో ఎందుకు అనుకున్నాడేమో తీర ప్రాంత నగరానికి పారిపోయాడు. ఎవరికీ కనిపించని విధంగా అత్యంత సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. దాని కంట పడకుండా ఉండేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు కిమ్‌ జాంగ్‌. ప్రభుత్వంలోని ఒకరిద్దరు ముఖ్యులకు మాత్రమే కిమ్‌ జాడ తెలుసని.. మరెవరికీ అతనెక్కడున్నాడన్నది అంతుబట్టడం లేదు. మిసైల్‌ టెస్టులతో అగ్రరాజ్యం అమెరికాను వణికించిన కిమ్‌ ఇలా అడ్రస్‌ లేకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కిమ్‌జాంగ్‌ ఉన్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో నార్త్‌ కొరియా అధినేత కిమ్‌ తీర ప్రాంతం వాన్సన్‌ నగరానికి వెళ్లారు. కరోనా తగ్గే వరకూ రాజధాని ప్యాంగ్యాంగ్‌ సిటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కిమ్‌. నార్త్‌ కొరియాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి 180 మంది సైనికులు మృతి చెందినట్లు నార్త్‌ కొరియా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా కిమ్‌ వాన్సన్‌ నగరానికి వెళ్లారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ అన్ని దేశాల్లో కలిపి లక్షా 18 వేల మంది కొవిడ్‌-19 వైరస్‌ బారినపడగా, 4 వేల 290 మంది మృత్యవాత పడ్డారు. ముఖ్యంగా ఇటలీలో మృత్యు ఘోష కొనసాగుతోంది. అమెరికా సైతం కరోనా కేసులతో అల్లాడిపోతుండటంతో యూరోప్‌ దేశాల నుంచి నెల రోజుల పాటు రాకపోకలను నిషేధించారు అధ్యక్షుడు ట్రంప్‌. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow Us
జూన్‌ 21వ తేదీన నీట్‌(UG) పరీక్ష నిర్వహిస్తామన్న NTA
జూన్‌ 21వ తేదీన నీట్‌(UG) పరీక్ష నిర్వహిస్తామన్న NTA
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
పాములను తరిమి కొట్టే కొబ్బరికాయ మంత్రం..ఇలా చేస్తే అవి పరుగోపరుగు
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?