AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీరీలను వణికిస్తున్న కరోనా సర్వే !

కరోనా మహమ్మారి కశ్మీర్ లను వణికిస్తోంది. కశ్మీర్ ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తాజాగా కరోనాపై నిర్వహించిన సర్వేలో తేలింది. నిత్యం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో నరకం చూసిన కశ్మీరీలపై కనిపించని శత్రువు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.

కశ్మీరీలను వణికిస్తున్న కరోనా సర్వే !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 2:58 PM

Share

కరోనా మహమ్మారి కశ్మీర్ లను వణికిస్తోంది. కశ్మీర్ ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో కశ్మీర్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో నిత్యం నరకం చూసిన కశ్మీరీలపై కనిపించని శత్రువు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. 98 శాతం మంది కశ్మీరీలు కరోనా బారినపడే ప్రమాదం ఉందని, వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు కేవలం 2 శాతం జనాభాలోనే అభివృద్ధి చెందుతున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 400 రక్త నమూనాలను పరిశీలించిన ఈ సర్వేలో కరోనా వైరస్‌తో పోరాడగల యాంటీ బాడీల ఉనికి కేవలం 8 శాతం మందిలోనే గుర్తించారు. దేశవ్యాప్తంగా 82 జిల్లాల్లో ఐసీఎంఆర్‌ నిర్వహించిన ఈ సర్వేలో వ్యాధి నిరోధక శక్తి కలిగిన జనాభా కేవలం 0.73 శాతమేనని తేల్చింది. ఇప్పుడు ఇదే కశ్మీర్ ప్రజల ఆందోళనకు కారణం. ఇటీవల కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఐసీఎంఆర్‌ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కేవలం 2 శాతం మంది రక్తంలోనే యాంటీబాడీలు ఉన్నట్టు ఈ సర్వేలో నిపుణులు గుర్తించారు. ఇటీవల ఎవరైనా వైరస్‌ బారిన పడి కోలుకుని ఉంటే వారు వైరస్‌లను ఎదర్కొనే యాంటీబాడీలను కలిగి ఉంటారని డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కశ్మీర్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నిసారుల్‌ హసన్‌ తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెడితే వైరస్‌ బారినపడతారని, ఆ తర్వాత కోలుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటారని నిసారుల్‌ హసన్‌ చెబుతున్నారు. వైరస్‌ స్వభావంలో మార్పు చెందితే అది భిన్నంగా ప్రవరిస్తూ మరిన్ని మరణాలు సంభవించవచ్చని, దాంతీ ఇప్పటివరకూ మనం తీసుకున్న చర్యలన్నీ వృధా అవుతాయని హెచ్చరించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను ధరిస్తూ తరచూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.