Remdesivir: రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత కరోనా రెండో వేవ్ ఎదుర్కోవడంలో ప్రభావాన్ని చూపిస్తోందా?

|

Apr 15, 2021 | 8:46 PM

కరోనా మొదటి దశ ఎగసి పడుతున్న సమయంలో.. కరోనా నుంచి రక్షణ పొందడం మాట అటుంచి.. కరోనా సోకితే ఏ మందు వాడాలో తెలీని పరిస్థితి. ఆ సమయంలో కరోనా సోకిన వ్యక్తికి ఉన్న లక్షణాలను బట్టి చికిత్స చేయడం ప్రారంభించారు.

Remdesivir: రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత కరోనా రెండో వేవ్ ఎదుర్కోవడంలో ప్రభావాన్ని చూపిస్తోందా?
Remdesivir
Follow us on

Remdesivir:  కరోనా మొదటి దశ ఎగసి పడుతున్న సమయంలో.. కరోనా నుంచి రక్షణ పొందడం మాట అటుంచి.. కరోనా సోకితే ఏ మందు వాడాలో తెలీని పరిస్థితి. ఆ సమయంలో కరోనా సోకిన వ్యక్తికి ఉన్న లక్షణాలను బట్టి చికిత్స చేయడం ప్రారంభించారు. తరువాత కూడా అదే పరిస్థితి ఉన్నా.. ఇతమిత్ధంగా కొన్ని మందులు కరోనా సోకిన వారికీ క్వారంటైన్ లో ఉన్నపుడు ఇస్తూ వచ్చి వారిని రక్షించారు. ఇదే సమయంలో ‘రెమిడిసివర్’ పేరు తెరమీదకు వచ్చింది. దీనిని కరోనా తీవ్రంగా ఉన్న కేసులలో ఉపయోగించడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని నమ్మారు. దీంతో ఈ మందు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు కరోనా సోకిన సమయంలో కూడా ఇదే మందును వాడినట్టు వెల్లడించారు. ఇక ఈ రెమిడిసివర్ వల్ల ఉపయోగాల మాట పక్కన పెడితే చాలా కేసుల్లో ఈ మందును వాడుతూ వచ్చారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారికీ ఈ మందును డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతున్న వేళలో రెమిడిసివర్ నిల్వలు తగినంత లేవని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఈ ఇంజక్షన్ ఎగుమతిని భారతదేశం నిషేధించింది. దీని తరువాత కూడా పరిస్థితి బాగాలేదు. వాస్తవానికి, ప్రస్తుతం దేశంలో 7 కంపెనీలు ఈ ఇంజక్షన్ ను తయారు చేస్తున్నాయి, ఇవి ప్రతి నెలా 39 లక్షల ఇంజక్షన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో ఉన్నాయి. అంటే రోజుకు 1.30 లక్షల మోతాదు అందుబాటులోకి తేగలవు. అయితే కరోనా రెండో వేవ్ తో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ఈ ఇంజక్షన్ తగినంత అందుబాటులోకి రావడం లేదు.

అయితే, కరోనా రెండో వేవ్ ఉధృతి సమయంలో ఈ ఇంజక్షన్ అందుబాటులో లేకపోడం అంత ప్రభావం చూపిస్తుందా అనేది ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రెమిడిసివర్ క్రిటికల్ కేసుల్లో ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కేసుల్లో లక్షణాలను త్వరగా తగ్గించడానికి రెమిడిసివర్ ఉపయోగపడుతుంది. రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటులోకి లేకపోవడంతో చాలా కేసులలో వ్యాధి లక్షణాలను తగ్గించడంలో జాప్యం జరుగుతుంది. అందువల్ల పేషెంట్లు ఎక్కువరోజులు ఆసుపత్రిలోనే గడపాల్సి వస్తుందని వారంటున్నారు.

రెమిడిసివర్ ఇంజెక్షన్ ధరను కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 3500 రూపాయలకు నిర్ణయించింది. ఏప్రిల్ చివరి నాటికి వాటి ఉత్పత్తి కూడా రెట్టింపు అవుతుందని తెలిపింది. ఇందుకోసం మరో 6 కంపెనీలు దీనిని ఉత్పత్తి చేయడానికి అనుమతి పొందాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి నెలా 38.80 లక్షల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నెల చివరి నాటికి సుమారు 8 మిలియన్ ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంటాయి. మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ప్రస్తుతం దేశంలో రెమిడిసివర్ ఇంజెక్షన్ తయారీదారులు మొత్తం 7 మంది ఉన్నారు. ఇప్పుడు దీనిని ఉత్పత్తి చేయడానికి మరో 6 కంపెనీలకు ఆమోదం ఇచ్చారు. దీంతో ఇక ప్రతి నెలా 10 మిలియన్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది.

అసలు రెమిడిసివర్ అంటే ఏమిటి?
రెమిడిసివర్ యాంటీ-వైరల్ ఔషధం. ఇది వైరస్ పెరగకుండా ఆపుతుంది. 2009 లో, హెపటైటిస్ సి చికిత్స కోసం యుఎస్ కు చెందిన గిలియడ్ సైన్సెస్ దీనిని మొదటిసారిగా తయారుచేసింది. దీనిపై 2014 వరకు పరిశోధనలు జరిగాయి, తరువాత దీనిని ఎబోలా చికిత్సలో ఉపయోగించారు. కరోనా వైరస్ ఫ్యామిలీ యొక్క మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS లేదా MERS) మరియు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS లేదా SARS) చికిత్సలో రెమిడిసివర్ ను ఉపయోగిస్తారు. 28 అక్టోబర్ 2020 న, యుఎస్ రెగ్యులేటర్ యుఎస్-ఎఫ్డిఎ కోవిడ్ -19 చికిత్స కోసం రెమిడిసివర్ ఆమోదించింది.

రెమాడెసివిర్ నిజంగా ప్రభావవంతంగా ఉందా?
దీనిపై పెద్దగా స్పష్టత లేదు. గిలియడ్ సైన్సెస్ డేటా ప్రకారం రెమాడెసివిర్ కోవిడ్ -19 రికవరీ సమయాన్ని ఐదు రోజులకు తగ్గిస్తుంది. ఇప్పటివరకు, 50 కి పైగా దేశాలు కోవిడ్ -19 చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నాయి. అయితే, ట్రయల్స్‌లో ఈ వాదనను డబ్ల్యూహెచ్‌ఓ ధృవీకరించలేదు. రోగి యొక్క తీవ్రమైన లక్షణాలు లేదా ప్రాణాంతక పరిస్థితులపై రెమిడిసివర్ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదని WHO తెలిపింది. ఇది ఎంతవరకూ కరోనా పేషెంట్స్ కు ఉపయోగపడుతుంది అనేది నిర్ధారణ కాకపోయినా, దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాత్రం తేలింది. ఈ ఇంజక్షన్ వాడిన వారిలో కొంతమందికి కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలు, అలెర్జీ, రక్తపోటు అదేవిధంగా హృదయ స్పందన రేటులో మార్పులు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి.

Also Read: Madhya Pradesh: కరోనా మరణాలను ఎవరూ ఆపలేరు…మంత్రి వెటకారపు మాటలపై వివాదం!

కోవిడ్ టీకా కొరతను అధిగమించేందుకు కేంద్రం ప్రణాళికలు.. విదేశీ వ్యాక్సిన్ల అనుమతిపై మూడు రోజుల్లో నిర్ణయం!