‘ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం’.. నేపాల్ పీఎం

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి […]

'ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం'.. నేపాల్ పీఎం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 20, 2020 | 3:13 PM

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి వారిని రప్పిస్తున్నారని అన్నారు. వాళ్ళే ఇందుకు బాధ్యులన్నారు. బయటి నుంచి వస్తున్న వారి కారణంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా కష్టమన్నారు. తమదేశ అంతర్భాగంలోని కాలాపానీ, లింపియాధుర, లిపిలేఖ్ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని శర్మ పేర్కొన్నారు. కాగా.. నేపాల్ లో కరోనా వైరస్ కి ఇండియాయే కారణమన్న ఆయన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు