AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: దేశంలో కంట్రోల్‌ లోకి వస్తున్న కరోనా.. గడిచిన 24గంటల్లో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కేసులు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్‌ వేవ్ రాకతో, అధ్వాన్నమైన పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. గడిచిన 24 గంటల్లో కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

India Corona: దేశంలో కంట్రోల్‌ లోకి వస్తున్న  కరోనా.. గడిచిన 24గంటల్లో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు
Corona
Balaraju Goud
|

Updated on: Feb 15, 2022 | 11:08 AM

Share

India Coronavirus Updates:  దేశంలో కరోనా మహమ్మారి కేసులు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్‌ వేవ్ రాకతో, అధ్వాన్నమైన పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. గడిచిన 24 గంటల్లో కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 30 వేల దిగువకు కేసులే నమోదు కావడం రిలీఫ్‌ కలిగిస్తోంది. సోమవారం 34 వేల 082 కేసులు నమోదు కాగా, ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా 27,409 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా రోగుల సంఖ్య ఇప్పుడు 4,26,92,943కి చేరుకుంది. కాగా, దేశవ్యాప్తంగా 347 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 4 లక్షల 23వేల 127 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. యాక్టివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. 24 గంటల్లో 82 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా, గత 24 గంటల్లో 347 మంది రోగులు మరణించగా, ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,09,358కి చేరుకుంది. దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 4.23 లక్షలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 82,817 మంది ఇన్ఫెక్షన్ నుండి కూడా నయమయ్యారు. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,17,60,458కి పెరిగింది. అదే సమయంలో, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,23,127, ఇది మొత్తం కేసులలో 0.99 శాతం.

గడిచిన 24 గంటల్లో 44 లక్షల వ్యాక్సిన్‌లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలో సోమవారం కరోనావైరస్ కోసం 12,29,536 నమూనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దేశంలో ఇప్పుడు నమూనా పరీక్ష సంఖ్య 75,30,33,302గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 173.42 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను వర్తింపజేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నాడు 44,68,365 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. తాజా గణాంకాల ప్రకారం, భారతదేశంలో మొత్తం టీకా సంఖ్య ఇప్పుడు 1,73,42,62,440కి చేరుకుంది. Read Also….   TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ..