AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెగ్గు మాత్రమే.. నగరంలో మద్యం పంపిణీ చేస్తున్న యువకులు.. !

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరకులు, అత్యవసర సేవలు మినహా.. మిగతావన్ని మూతపడ్డాయి. ఈ క్రమంలో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులకు ఇది మింగుడుపడటం లేదు. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో షరతులతో కొన్ని మద్యం షాపులు తెరుసేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయితే మన తెలంగాణలో మాత్రం మద్యం ప్రియులకు ప్రభుత్వం చేదువార్తే మిగిల్చింది. దీంతో ఎంతో మంది మద్యం ప్రియులు ఎప్పుడు […]

పెగ్గు మాత్రమే.. నగరంలో మద్యం పంపిణీ చేస్తున్న యువకులు.. !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 10:05 PM

Share

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరకులు, అత్యవసర సేవలు మినహా.. మిగతావన్ని మూతపడ్డాయి. ఈ క్రమంలో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులకు ఇది మింగుడుపడటం లేదు. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో షరతులతో కొన్ని మద్యం షాపులు తెరుసేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయితే మన తెలంగాణలో మాత్రం మద్యం ప్రియులకు ప్రభుత్వం చేదువార్తే మిగిల్చింది. దీంతో ఎంతో మంది మద్యం ప్రియులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని వేచిచూస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో కొందరికి నిత్యవసరాలు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారికి కొన్న స్వచ్ఛంద సంస్థలు వారికి సహాయం చేస్తున్నాయి. అయితే ఓ మద్యం ప్రియుడు.. వారంతా అలా చేస్తున్నారు కానీ.. మద్యం ప్రియులకు ఎవరు చేయడం లేదనుకున్నాడో ఏమో కానీ.. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి.. మద్యం పంపిణీ చేశాడు. రోడ్డుపై ఉన్న కొందరికి గ్లాసులు ఇచ్చి.. అందులో లిక్కర్ పోస్తూ.. లిక్కర్ సేవ చేస్తున్నాడు. దీనికి సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.