గోవాలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. రీజన్ ఇదే..
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. అయితే మొన్నటి వరకు కరోనా కేసులు లేవని చెప్పిన గోవా రాష్ట్రానికి మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. గత నెలలోనే దాదాపుగా రాష్ట్రంలో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని గోవా సీఎం ప్రకటించారు. దీంతో ఇక తమ రాష్ట్రం గ్రీన్ జోన్లోకి చేరిందని.. అక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే పాజిటివ్ […]
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. అయితే మొన్నటి వరకు కరోనా కేసులు లేవని చెప్పిన గోవా రాష్ట్రానికి మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. గత నెలలోనే దాదాపుగా రాష్ట్రంలో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని గోవా సీఎం ప్రకటించారు. దీంతో ఇక తమ రాష్ట్రం గ్రీన్ జోన్లోకి చేరిందని.. అక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే పాజిటివ్ వచ్చిన బాధితులంతా.. ముంబై నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరందర్నీ క్వారంటైన్లో ఉంచారు.
ఈ కేసుల విషయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా స్పందించారు. గత నెల ఏప్రిల్ 19వ తేదీన గోవాను కరోనా విముక్త రాష్ట్రంగా ప్రకటించారు. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఏడు కరోనా కేసులు నమోదవ్వగా.. వారంతా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అప్పటి నుంచి గోవాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే తాజాగా ఒకే సారి ఏడు కేసులు నమోదవ్వడంతో.. గోవా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Rapid PCR test of 7 persons has been found positive today. All 7 persons came to Goa from Mumbai, they all are asymptomatic. They have been put under quarantine. Their samples have been sent to Goa Medical College for confirmatory test: Goa CM Pramod Sawant pic.twitter.com/cZXH4FdsLy
— ANI (@ANI) May 13, 2020