స్వస్థలాలకు చేరుకుంటున్న ఆంధ్రా జాలర్లు

| Edited By:

May 01, 2020 | 12:45 PM

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు ఆంధ్రాలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ నుంచి ప్రత్యేక బస్సులలో 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులలో ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేటకు..

స్వస్థలాలకు చేరుకుంటున్న ఆంధ్రా జాలర్లు
Follow us on

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఎట్టకేలకు ఆంధ్రాలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ నుంచి ప్రత్యేక బస్సులలో 4,385 మంది మత్స్యకారులు 56 బస్సులలో ఆంధ్రా సరిహద్దు జగ్గయ్యపేటకు చేరుకున్నారు. సరిహద్దులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఇతర అధికారులు మత్స్యకారులకు స్వాగతం పలికారు. వాళ్లందరికీ విజయవాడలో బ్రేక్ ఫాస్ట్ అందించి వాళ్ళ క్షేమ సమాచారాన్ని కనుక్కున్నారు అధికారులు. అలాగే ఒక్కొక్కరికి రూ. 2 వేలు అందిస్తామన్నారు. కాగా మచిలీపట్నం, గూడురు, గుడ్లవల్లేరు, విజయనగరం, శ్రీకాకుళంలకు చెందిన మత్స్యకారులను అధికారులు స్వస్థలాలకు తరలిస్తున్నారు. అనంతరం జాలర్ల టీవీ9తో మాట్లాడుతూ గుజరాత్‌లో వారు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వివరించారు. ప్రభుత్వం చొరవ చూపకుంటే తమ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమయ్యారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!